పెద్దాపురం,31 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్):ఏఐటీయూసీ శత వార్షికోత్సవాలను స్థానిక వినాయకుడి గుడి సమీపంలో ఉన్న జుట్టు వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. జట్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు యాకా రామకృష్ణ ఆధ్వర్యంలో యూనియన్ సీనియర్ నాయకుడు ముమ్మన సత్యనారాయణ ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిన ఏఐటియుసి కార్మిక, కష్టజీవుల, అణగారిన వర్గాల సంక్షేమం, హక్కుల సాధన కోసం గత శతాబ్ద కాలంగా అవిశ్రాంత పోరాటం సాగిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను విడనాడి, కార్మికుల హక్కులను పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బోనం సోమేశ్వరరావు, బొట్టా త్రిమూర్తులు, బొడ్డు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







