ఖాజీపేట (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: కడప జిల్లా ఖాజీపేట ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహానికి సరకుల నిలిపివేతపై ఉదయం టీవీలో ప్రసారమైన వార్తకు స్పందన వచ్చింది. ఆదర్శ పాఠశాల వసతి గృహంలో భోజనాలు లేక 80 మంది విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్న విషయంపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సర్వ శిక్ష అభియాన్ ఏపీడీ దేవరాజ్ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వసతి గృహానికి సరకుల నిలిపివేతపై ఉన్నతాధికారులకు లేఖ రాసిన పాఠశాల ప్రిన్సిపల్ సురేష్తో ఏపీడీ దేవరాజ్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పందించిన ఏపీడీ.. వెంటనే ఇవాళ రాత్రి నుంచే పిల్లలకు భోజనాలు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహంలో అందుబాటులో ఉన్న 30 మంది విద్యార్థినులకు భోజన వసతి కల్పించారు. రేపు మొత్తం 80 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







