1/70 చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: గిరిజనుల భూములకు రక్షణ కవచం 1/70 చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని గిరిజన వర్ధిక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కె.చిన్నారావు అధికారులను కోరారు. ఇటీవల మండలంలోని లక్కొండలో ప్రభుత్వ భూమిని గిరిజనేతరులు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని తమ సంస్థ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు భూములను సర్వే చేసి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే ఏజెన్సీలో గిరిజనేతరుల సాగులో ఉన్న భూములను గుర్తించి వారి నుంచి స్వాధీనం చేసుకొని గిరిజనులకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలు సక్రమంగా అమలు చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us