UPDATED 18th JULY 2017 TUESDAY 9:00 PM
కాకినాడ : జిల్లాలోవర్షాలపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో ఇబ్బందికర పరిస్థితి లేదని, గోదావరి వరద తక్కువగానే ఉందని కలెక్టర్ అన్నారు. రానున్న 24 గంటల్లో ఏజెన్సీలో భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో గిరిజనులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు, మందులు, ఆహారం, కిరోసిన్ సిద్దం చేశామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు.







