గంగవరం (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీరత్నం సూచించారు. మండలంలోని కొత్తడలో రైతుభరోసా కేంద్రంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు గురువారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ప్రకారం రైతులు గిట్టుబాటు ధర పొందాలన్నారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామాల్లోని రైతులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీమన్నారాయణ, మండల వ్యవసాయ అధికారి సరళ, ఎంపీటీసీ ప్రభాకర్ రావు, సర్పంచ్ కామరాజు దొర, ఆర్ఐ జిలాని తదితరులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







