నూరు శాతం హాజరు ఉండాల్సిందే

గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాశాఖాధికారి వై. మల్లేశ్వరరావు ఆదేశించారు. గురువారం మండలంలోని కొత్తాడలో కస్తూరిబా విద్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలో పలు రికార్డులను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అలాగే విద్యాలయం నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ప్రీ పబ్లిక్ పరీక్షల నిర్వహణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట విద్యాలయం ప్రత్యేక అధికారిణి పద్మావతి, సి.ఆర్.పి ప్రసాద్ తదితరులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us