పెద్దాపురం:31 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఏక్తా దివస్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జంధ్యాల వెంకటరమణ పాల్గొన్నారు. ముందుగా సర్దార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరించడంతోపాటు, స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రి మండలిలో హోంశాఖ మంత్రిగా, ఉప ప్రధానమంత్రి పనిచేశారన్నారు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను ఎంతో చాకచక్యంతో అణచివేశారని గుర్తుచేశారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులను అందచేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







