సామర్లకోట:10 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్):
జిల్లా కేంద్రామైన కాకినాడ నుంచి సామర్లకోటకు వచ్చే రోడ్డుకు మోక్షం కల్పించాలని పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు గురువారం సైకిల్ పై నిరసన వ్యక్తం చేశారు. పెద్దాపురం నుంచి కాకినాడ వరకు సైకిల్ పై ర్యాలీ నిర్వహించి జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాకినాడ వ్యాపార వాణిజ్య విద్యా ఉద్యోగ తదితర అవసరాల నిమిత్తం తరచూ ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు నిర్వహించడం
జరుగుతుందన్నారు. అయితే సామర్లకోట నుంచి కాకినాడ వచ్చే రోడ్డు అధ్వానంగా
మారడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని,
రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో
పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి నెలకొందన్నారు. రోడ్లు గుంతలు పడి
వర్షపు నీటితో నిండి చెరువులుగా కనిపిస్తున్నాయన్నారు.
ఈ రోడ్డులో ప్రయాణించే అనేక మంది ప్రాణాలు
కోల్పోవడం జరిగిందన్నారు. కాకినాడ సామర్లకోట రోడ్డును తక్షణమే పునరుద్ధరించాలని వారు కోరారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







