రెడ్ బీ న్యూస్,31 డిసెంబర్ 2021: ఇప్పటికే రెండు రైల్వేస్టేషన్ల పేర్లు మార్చిన ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం.. తాజాగా ఝాన్సీ రైల్వేస్టేషను పేరును ‘వీరాంగణ లక్ష్మీబాయి రైల్వేస్టేషన్’గా మార్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషను విడుదల చేసింది. తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2021, నవంబరు 24న రాసిన లేఖను కూడా జోడించింది. ఈ క్రమంలో మార్పు ప్రక్రియ మొదలుపెట్టినట్లు ఉత్తర మధ్య రైల్వే చీఫ్ పీఆర్వో శివం శర్మ చెప్పారు. యోగి సర్కారు ఇప్పటికే మొఘల్సరాయ్ రైల్వేస్టేషను పేరును దీన్దయాల్ ఉపాధ్యాయ జంక్షన్గా, ఫైజాబాద్ రైల్వేస్టేషన్ పేరును అయోధ్య జంక్షన్గా మార్చింది. అలాగే.. ఫైజాబాద్, అలహాబాద్ జిల్లాల పేర్లను అయోధ్య, ప్రయాగ్రాజ్లుగా మార్పు చేసింది.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







