గంగవరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ఈ నెల 27న గంగవరం మండలం నెల్లిపూడిలో నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెల్లిపూడి సర్పంచ్ పాతర రమణమ్మ కోరారు. గోకవరంకు చెందిన జనహిత జనరల్ హాస్పిటల్ డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శక్తి నరసింహ ఆధ్వర్యంలో షుగర్, బీపీ, కీళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్, చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక జ్వరాలు, కంటి సంబంధిత వ్యాధులకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నెల్లిపూడి పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







