UPDATED 9th OCTOBER 2017 MONDAY 4:00 PM
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పౌరసంబందాధికారిగా కొనాల రామమోహనరావు సోమవారం పదవీ భాద్యతలు స్వీకరించారు. ఈయన గతంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు డివిజినల్ పౌర సంబంధాధికారిగా పనిచేసి పదోన్నతి పై ఇక్కడికి వచ్చారు. గతంలో కాకినాడ డిపిఆర్వో కార్యాలయంలో సహాయ పౌరసంబంధాధికారిగా రాజమహేంద్రవరం, నర్సాపురం, కొవ్వూరు పట్టణాలలో డిఎల్పీఆర్వో గా పనిచేసారు. ఈ సందర్భంగా ఉప సంచాలకులు ఎం.ఫ్రాన్సిస్, కార్యాలయ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియచేశారు.







