UPDATED 29th MARCH 2018 THURSDAY 10:00 PM
సామర్లకోట: నవభారత్ సుగర్స్ ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం వెలువడడం వల్ల పలు వ్యాధుల బారిన పడుతున్నామని మండలంలోని హుస్సేన్ పురం గ్రామానికి చెందిన ప్రజలు గురువారం ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యం వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.







