UPDATED 21st SEPTEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండల పరిధిలోని గొంచాల గ్రామంలో శ్యామలాంబ గుడి ఆవరణలో నాలుగు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న చిందాని కుటుంబ సభ్యులకు ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రజక హక్కుల పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో కమిటీ నాయకులు ఇరుసుమళ్ళ విష్ణు, దేవరకొండ సత్యనారాయణ, కాకినాడ శ్రీనివాస్, కాకినాడ రాజు, చిందాని వీర్రాజు, చిందాని సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.







