UPDATED 23rd DECEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: మదర్ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ 25వ వార్షికోత్సవం పురస్కరించుకుని జెఎన్టీయుకె సౌజన్యంతో లయన్స్ క్లబ్ ప్రతినిధులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. సామర్లకోట పట్టణానికి చెందిన అమలకంటి శ్రీనివాసరావుకు ఆంధ్ర సేవారత్న, బుర్రా కృష్ణ మోహన్ కు యువశక్తి పురస్కారాలను వారి సేవలకు గుర్తింపుగా అందచేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఉమర్ అలీషా, చిత్తులూరి వీర్రాజు, ఈశ్వరకుమార్, రెడ్డి, సేపేని సురేష్, తదితరులు పాల్గొన్నారు.







