UPDATED 11th NOVEMBER 2019 MONDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట మండలం వేట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు లభించాయి. పాఠశాల పదవ తరగతి విద్యార్థులు మోరంపూడి వీర దుర్గాదేవి, మేడిశెట్టి లక్ష్మీరాజేష్ 2018-19 సంవత్సరంగాను జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహం చేతుల మీదుగా కాకినాడలో ఈ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం పి. జాన్, ఉపాధ్యాయుల బృందం, తదితరులు విద్యార్థులను అభినందించారు.







