గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: పీడిత జనవిముక్తి కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బాదంపూడి బాబూరావు అన్నారు. బయ్యనపల్లిలో రైతుకూలీలతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి, భుక్తికోసం ఈ దేశ విముక్తి కోసం కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి మొదలుకొని సుమారు అయిదు వేల మంది కామ్రేడ్స్ అమరత్వం పోందారని, ముఖ్యంగా నవంబరులో ముఖ్యనాయకులు అమరులైయ్యారన్నారు. అందుకే ఈ నెలంతా గ్రామ గ్రామాన అమరులను స్మరించుకుంటూ సభలు సమావేశాలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ నెల పదకొండవ తేదిన గంగవరంలో సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి డి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







