UPDATED 28th MARCH 2018 WEDNESDAY 9:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసి ఉన్న మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మూడు నెలలకు రూ. 1,61,410 ఆదాయం సమకూరినట్లు ఆలయ అసిస్టెంట్ కమీషనర్ ఆర్. పుష్పనాథం, ఆలయ చైర్మన్ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ తెలిపారు.







