హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: నగర వాసులకు శుభవార్త. నూతన సంవత్సరం కానుకగా షేక్పేట ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం కింద రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 2.8 కిలోమీటర్ల ఈ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులతో ఆరు వరుసలతో నిర్మించిన ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి జేఎన్టీయూ జంక్షన్ వరకు 17 కిలోమీటర్ల మేర ఏ విధమైన ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభతరం చేస్తుందని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం ప్రకటించింది
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







