లోకాయుక్తలో తహసీల్దారుపై కేసు

కాట్రేనికోన (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: తమ సొంత భూమి(పార్వతిదేవి, ఆమె తల్లి నాగరత్నంకు.. సర్వే నంబరు 424/2లో 50 సెంట్లు చొప్పున)కి సంబంధించి రెవెన్యూ అధికారులు వేరొకరికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చి అన్యాయం చేశారని కాట్రేనికోన మండలం కందికుప్పకు చెందిన మహిళారైతు గోనెమడతల పార్వతీదేవి ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించి తహసీల్దారుపై కేసు నమోదు చేసింది. ఈ నెల 27న కేసు విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. తనకు అందిన లేఖను చూపిస్తూ ఆదివారం విలేకర్లతో ఆమె మాట్లాడారు. దీనిపై తహసీల్దారు, జిల్లా కలెక్టరుకు ‘స్పందన’లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అక్టోబరులో లోకాయుక్తను ఆశ్రయించానన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us