కాట్రేనికోన (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: తమ సొంత భూమి(పార్వతిదేవి, ఆమె తల్లి నాగరత్నంకు.. సర్వే నంబరు 424/2లో 50 సెంట్లు చొప్పున)కి సంబంధించి రెవెన్యూ అధికారులు వేరొకరికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చి అన్యాయం చేశారని కాట్రేనికోన మండలం కందికుప్పకు చెందిన మహిళారైతు గోనెమడతల పార్వతీదేవి ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించి తహసీల్దారుపై కేసు నమోదు చేసింది. ఈ నెల 27న కేసు విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. తనకు అందిన లేఖను చూపిస్తూ ఆదివారం విలేకర్లతో ఆమె మాట్లాడారు. దీనిపై తహసీల్దారు, జిల్లా కలెక్టరుకు ‘స్పందన’లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అక్టోబరులో లోకాయుక్తను ఆశ్రయించానన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







