ఆర్టీసీ డీసీఎంఈగా షర్మిళ అశోకా బాధ్యతల స్వీకరణ

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 23 అక్టోబర్ 2021 : జిల్లా ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ (డీసీఎంఈ)గా కె.షర్మిలాఅశోకా రాజమహేంద్రవరంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు-1 ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేసిన ఆమె ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బస్సుల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూస్తామన్నారు. మెకానికల్‌ విభాగం సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ బస్సుల్లో యాంత్రిక లోపాలు, ఇతర సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us