UPDATED 16th JULY 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం వెంకట కృష్ణరాయపురం-సత్యవరంపేట మధ్యలో ఉన్న ఏలేరు కాల్వగట్టు కోతకు గురికావడంతో రైతులు అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వెంటనే అప్రమత్తమై హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తాత్కాలికంగా చర్యలు చేపట్టారు. ఈ సంఘటన స్థలంలో హోంమంత్రి పిఎ నిమ్మకాయల సుబ్బారావు, తహసీల్దార్ ఎల్. శివకుమార్, ఇంచార్జ్ ఎంపిడివో సి.హెచ్. జగ్గారావు, ఇరిగేషన్ డిఇ పంపా వెంకట శివకుమార్, గ్రామ సర్పంచ్ కుర్రా నారాయణస్వామి, అడబాల చిట్టిబాబు, తదితరులు ఉన్నారు.







