UPDATED 25th JANUARY 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: జాతీయ ఓటరు దినోత్సవాన్ని స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులచే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు విలువ, ఓటరు బాధ్యతలను హెచ్ఎం వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పిడి తాళ్లూరి వైకుంఠం, ఉపాధ్యాయులు ఏ.ఎల్.వి. కుమారి, జి. గోవిందు, కె. అరుణ, కెవివి సత్యనారాయణ, రాజేంద్రకుమార్, చంద్రమోహన్, బి శ్రీ లక్ష్మి, శ్రీవల్లి భార్గవి, శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







