పంచారామాలకు ప్రత్యేక బస్సులు
గంగవరం (రెడ్ బీ న్యూస్) 5 నవంబర్ 2021:
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం గోకవరం ఆర్టీసీ డిపో నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ దేముడు బాబు తెలిపారు. మండలంలోని దేముడు బాబు ఆధ్వర్యంలో శుక్రవారం పర్యటించి తమ సంస్థ భక్తులు కనిపిస్తున్న సౌకర్యాలను వివరించారు. పంచారామాలు, ఉత్తరాంధ్ర క్షేత్ర దర్శిని, కోనసీమ క్షేత్ర దర్శిని, తెలంగాణ పంచారామాలు, భద్రాది క్షేత్ర దర్శిని పేర్లతో ప్రత్యేక సర్వీసులు నడపడం జరుగుతుందని వివరించారు. భక్తుల కోరికపై వారికి అవసరమైన రోజుల్లో వారి గ్రామాలకే బస్సులను పంపడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు గోకవరం డిపోలో సంప్రదించాలని ఆయన కోరారు.







