సామర్లకోట,28 ఆగస్టు 2020 (రెడ్ బీ న్యూస్):పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట చాళుక్య కుమారరామ భీమేశ్వర సమేత బాల త్రిపుర సుందరి అమ్మవారి
గర్భాలయానికి దాత బోడె రామచంద్ర యాదవ్ ఆర్ధిక సహకారంతో సుమారు రూ. 8 లక్షల విలువైన వెండి మకర తోరణం, వెండి ద్వార
అలంకరణ నిర్వహించి ఆలయ ఈవో పులి నారాయణమూర్తికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులచే వెండి ఆభరణాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 14 కిలోల 803 గ్రాముల వెండిని 10 విభాగాలుగా రూపొందించి గర్భాలయానికి అత్యంత రమణీయంగా అలంకరణ నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో రామచంద్ర యాదవ్ దంపతులు,
నోరి కృష్ణారావు, వేదపండితులు కొంతేటి జోగారావు, శర్మ,
రాంబాబు వెంకన్న, గుమస్తా వీరభద్రరావు, తదితర భక్తులు
పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







