UPDATED 26th FEBRUARY 2018 MONDAY 7:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం నవర జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులు కాకినాడలో జరిగిన జోన్ గ్రిగ్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు. సీనియర్స్ బాలుర అథ్లెటిక్స్ షాట్ ఫుట్ విభాగంలో ఎన్. వీరబాబు ప్రథమ బహుమతి, డిస్క్ త్రోలో నాల్గవ స్థానం, లాంగ్ జంప్ లో అమలావతి నాల్గవ స్థానం పొందినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సి.హెచ్.సత్యవతి తెలిపారు. విద్యార్థులను పిజికల్ డైరెక్టర్ ఎస్. జయలక్ష్మి, ఎం. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు.







