ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ

UPDATED 27th FEBRUARY 2019 WDNESDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఏఎస్, ఎస్ఎల్ఏఎస్ లపై ఉపాధ్యాయులకు రెండురోజులపాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య  హాజరై మాట్లాడుతూ మండల పరిధిలోని 73 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఉపాధ్యాయులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం చిట్టిచేతులు చక్కని రాతలు పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.    

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us