UPDATED 5th MARCH 2018 MONDAY 9:30 PM
సామర్లకోట: కాలుష్యం బారి నుంచి రక్షణ కల్పించమని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్ పురం కొత్తపేట ఏరియా గ్రామ ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎ.డి.బి. రోడ్డ్డులో ఉన్న రాక్ సిరామిక్స్ నుంచి తెల్లటి బూడిద ఎగిరి మా ఇళ్ళు, త్రాగే నీళ్ళు, ఆహార పదార్థాల మీద పడడం వల్ల అవి కలుషితమై తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వై. శ్రీదేవి, పి. లక్ష్మీ, సి.హెచ్. అర్జున్, వై.రమణమ్మ, తదితరులు ఉన్నారు.







