ఉద్యోగులకు చేసిన సేవలే గుర్తింపునిస్తాయి

గంగవరం (రెడ్ బీ న్యూస్) డిసెంబర్ 2021 : ఉద్యోగులకు చేసిన సేవలే గుర్తింపునిస్తాయని, అలాగే పదవీ విరమణ సహజమని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం అన్నారు. మండలంలో పంచాయతీరాజ్ విస్తరణాధికారిగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన వర్రే శివరామకృష్ణ వీడ్కోలు సభకు ఎంపీడీవో జాన్ మిల్టన్ అధ్యక్షత వహించగా ఎంపీపీ, జడ్పీటీసీలు ముఖ్య అతిథిలుగా హాజరై శివరామకృష్ణ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వెంకటలక్ష్మి, కె.ఎస్ ప్రభాకరరావు, కనకలక్ష్మి, ఉపాధిహామీ ఏపివో సురేష్ కుమార్, పలువురు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us