గంగవరం (రెడ్ బీ న్యూస్)15 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆశావర్కర్ ముర్ల చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గంగవరం పీహెచ్సీ ఎదుట సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరానికి యూటీఎఫ్ మండలశాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బుధవారం సాయంత్రం యూటీఎఫ్ నాయకులు దీక్షా శిబిరాన్ని చేరుకొని ఆశా వర్కర్లకు యూటీఎఫ్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ ఆశ కార్యకర్త చిన్నారి మృతి చెంది నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని, గౌరవ వేతనం పేరుతో రూ.10 చెల్లిస్తామని రూ. 6,600 మాత్రమే చెల్లించడం చాలా అన్యాయమన్నారు. గౌరవ వేతనం పేరుతో ఆశ కార్యకర్తల కుటుంబాలకు అమ్మఒడి, జగనన్న చేయూత, రేషన్ కార్డు వంటి ప్రభుత్వ సహాయాన్ని తొలగించడం దారుణమని ఆయన అన్నారు. దీక్షా శిబిరం సందర్శించిన వారిలో యూటీఎఫ్ మండల గౌరవ అధ్యక్షుడు పి.రాంబాబు అధ్యక్ష కార్యదర్శులు రఘుబాబు దొర, రాంబాబు దొర, జిల్లా కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, బాబురావు, రుక్మిణిదేవి, నాగమణి, లక్ష్మీ తదితరులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







