UPDATED 17th OCTOBER 2019 THURSDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు దేవాదాయ ఇనస్పెక్టర్ వి.యల్.యన్. రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఏడు నెలల ఆరు రోజులకుగాను రూ.11,46,811 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.







