పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 75 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. స్థానిక లూధరన్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శనను పెద్దాపురం సబ్ ఇనస్పెక్టర్ ఆర్.మురళీమెాహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం స్మరించుకోవడం అంటే భారతదేశ సార్వభౌమాదికారాన్ని కాపాడుకోవడం కృషి చేయ్యడం అన్నారు. లౌకిక భారతాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనందరం కృషి చేయాలన్నారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని పుట్టిన దగ్గర నుంచి మరణించేవరకూ మనం ఆచరిస్తూ ఉంటామని, భావ ప్రకటనా స్వేచ్చని, వాక్ స్వాతంత్ర్యాన్ని, పత్రికా స్వేచ్చని మనకు రాజ్యాంగం అందించిందని అన్నారు. ఈ ప్రదర్శన మార్గంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. ప్రదర్శనలో విద్యార్దులు, కార్మిక సంఘాల సభ్యులు, యువకులు పాల్గోన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







