సామర్లకోట: 7 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్):
క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు వైఎస్ఆర్సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. మైదానంలో క్రీడలు ఆడేందుకు వీలులేకుండా ఫెన్సింగ్ వేస్తుండడంతో పలువురు క్రీడాకారులు దొరబాబు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కళాశాల క్రీడా మైదానాన్ని పరిశీలించారు. స్థానికంగా సాధన చేస్తున్న రాష్ట్రస్థాయి క్రీడాకారులు ఎంతమంది ఉన్నారు అనే విషయంపై దొరబాబు ఆరా తీశారు. క్రీడాకారులకు ఇబ్బందులు కలిగించవద్దని ఆదేశించారు. అయితే గ్రౌండ్స్ లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని, దీని వలన క్రికెట్ పీచ్ కు ఎటువంటి ఇబ్బందులు ఉండవని కోచ్ ప్రసాద్ వివరించారు. క్రికెట్ పిచ్ ను సైతం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసే బాధ్యత తనదిగా దొరబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు అవాల లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ రాజా, రవి, సురేష్, శివ, మనోజ్, పవన్, బద్రి, నాగు, శివ, చిట్టి, పవన్, సాంబ జనార్ధన్, బన్ను, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు థామస్, వైసీపీ నాయకుడు సల్లూరి కళ్యాణ్, పాలక చంటిబాబు, జట్లా మోహన్, పి. లోవరాజు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







