గంగవరం (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుబంధంగా విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగికి శుక్రవారం కొవిడ్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో గంగవరంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవల మండలంలో కొవిడ్ కేసులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న ప్రజలకు మళ్లీ కోవిడ్ కేసు రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తాహశీల్దార్ శ్రీమన్నారాయణ కోరారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవలన్నారు. త్వరలోనే కివిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







