అమరావతి (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలకు ఈనెల 30 వరకూ సెలవులు పొడిగించడంతో.. ఏపీలో పాఠశాలలకు సెలవులు పొడిగింపుపై విద్యాశాఖలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై సోమవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో కరోనా పాజిటివ్ రేట్ ఇప్పటికే 13.87 శాతానికి చేరడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయని వైద్యులు చెపుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్ధుల ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. వారికి ఇంకా వ్యాక్సినేషన్ పూర్తికానందున పాఠశాలలు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు తర్జన బర్జన పడుతున్నారు. ఒకవేళ పాఠశాలలు కొనసాగిస్తే ఎక్కడైనా కేసులు వెలుగు చూస్తే ఏం చేయాలనే దానిపై కూడా చర్చలు జరుపుతున్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







