UPDATED 12th JANUARY 2018 FRIDAY 7:30 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో స్థానిక ప్రతిభ విద్యానికేతన్ పాఠశాలలో తాచుపాము భయాందోళనలు కలిగించింది. పాఠశాల వెనుకవైపు పిల్లలు ఆడుకొంటుండగా అకస్మాత్తుగా అక్కడికి తాచుపాము రావడంతో ఒక్కసారిగా స్కూలు పిల్లలు భయంతో పరుగులు తీశారు. ఇది చూసిన స్థానికులు దాన్ని చంపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల సమీపంలో తుప్పలు పెరిగిపోవడం వల్ల విష పురుగులు తరచూ వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.







