UPDATED 14th MARCH 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రం శ్రీ కుమారామ భీమేశ్వరస్వామి ఆలయంలో పనిచేస్తున్న పురావస్తుశాఖ అధికారి టి. రఘునాథరావు మృతికి బుధవారం పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ట్రస్టు బోర్డు సభ్యులు మహంకాళి వెంకటగణేష్, పడాల వీరబాబు, దూది రాజు, ఇమ్మంది వెంకటేశ్వరరావు, బాడితమాని త్రిమూర్తులు, భక్త సంఘం నాయకుడు బిక్కిన సాయి, ఆలయ పండితులు, తదితరులు సంతాపం తెలియజేశారు.







