UPDATED 6th OCTOBER 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం మాధవపట్నం చైతన్య ఇంజనీరింగ్ కళాశాల, వెంకట కృష్ణరాయపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ లపై శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎల్. శివకుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ ఏర్పాటుతో ఓటు విలువ ఆవశ్యకతను యువత తెలుసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి.వి. కృష్ణంరాజు, కరెస్పాండంట్ డాక్టర్ వంశీకృష్ణ, ప్రిన్సిపాల్ జి.ఎస్.ఎన్. మూర్తిరాజు, తదితరులు పాల్గొన్నారు.







