నాడు-నేడు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదు

వై.రామవరం:1 జులై 2020:(రెడ్ బీ న్యూస్):నాడు నేడు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన నాడు నేడు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య ఇంజినీరింగ్ అధికారులను హెచ్చరించారు. వై.రామవరం మండలంలో తోటకూరపాలెం, దాలిపాడు, దేవర మడుగుల, ఎంపీపీ పాఠశాలను, చవిటి దిబ్బల కేజీబీవీ పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులను ఆయన పరిశీలించారు. నాడు నేడు ద్వారా ఏడు మండలాల్లోని 137 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆయన వెంట గిరిజన సంక్షేమ అధికారి శంభుడు, డీఈ గౌతమి, ఏఈ వర్మ, మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us