వెంకటేశ్వరస్వామి ఆలయంలో కొనసాగుతున్న భగవద్గీత ప్రవచనాలు

పిఠాపురం (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021 : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ (తిరుపతి) ఆధ్వర్యంలో స్థానిక శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పెద్దాపురం పట్టణానికి చెందిన సనాతన ధర్మ గీతా ప్రచారకులు మల్లిఖార్జునస్వామి ఆధ్వర్యంలో భగవద్గీత ప్రవచన కార్యక్రమం కొనసాగుతోంది. దీనిలో భాగంగా పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం పారాయాణాన్ని మంగళవారం వివరించారు. అనంతరం భక్తులు మల్లిఖార్జున స్వామిని పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో పిఠాపురం యాజ్ఞవల్క్య సంఘం అధ్యక్షుడు మానుగర్ర సుబ్రహ్మణ్యం, మిరియాల సందీప్, సమితి ఆర్గనైజర్ సత్యకుమార్ అధిక సంఖ్యలు భక్తులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us