మా కొండలు అప్పగించ వద్దు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: మండలంలోని మర్రిపాలెం పరిధిలో ఉన్న జెర్రీ కొండ దొడ్డి కొండలను అటవీ శాఖకు అప్పగించ వద్దని జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, ఎంపీపీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ గంగాదేవి తాహశీల్దార్ శ్రీమన్నారాయణను కోరారు. బుధవారం వీరి ఆధ్వర్యంలో మర్రిపాలెం గిరిజనులు తాహశీల్దార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. తాత ముత్తాతల కాలం నుంచి రెండు కొండలను గ్రామ అవసరాల కోసం కొండపోడు వ్యవసాయాలకు ఉపయోగించుకోవడం జరుగుతోంది అని, ఆ కొండలను అటవీ శాఖ అప్పగించ వద్దని వారు కోరారు. ఆ రెండు కొండలు అటవీశాఖ అప్పగించేందుకు రెవెన్యూ, అటవీశాఖ సిబ్బంది సర్వే చేపట్టడం సమంజసం కాదన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us