గంగవరం (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: మండలంలోని మర్రిపాలెం పరిధిలో ఉన్న జెర్రీ కొండ దొడ్డి కొండలను అటవీ శాఖకు అప్పగించ వద్దని జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, ఎంపీపీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ గంగాదేవి తాహశీల్దార్ శ్రీమన్నారాయణను కోరారు. బుధవారం వీరి ఆధ్వర్యంలో మర్రిపాలెం గిరిజనులు తాహశీల్దార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. తాత ముత్తాతల కాలం నుంచి రెండు కొండలను గ్రామ అవసరాల కోసం కొండపోడు వ్యవసాయాలకు ఉపయోగించుకోవడం జరుగుతోంది అని, ఆ కొండలను అటవీ శాఖ అప్పగించ వద్దని వారు కోరారు. ఆ రెండు కొండలు అటవీశాఖ అప్పగించేందుకు రెవెన్యూ, అటవీశాఖ సిబ్బంది సర్వే చేపట్టడం సమంజసం కాదన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







