గంగవరం (రెడ్ బీ న్యూస్) 18 నవంబర్ 2021: మండలంలోని నాలుగు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ శ్రీమన్నారాయణ, మండల వ్యవసాయ అధికారిణి సరళ అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ శాఖ సిబ్బంది, వీఆర్వోలు, టెక్నికల్ అసిస్టెంట్లకు గురువారం అవగాహన కల్పించారు. మండలంలోని మోహనపురం, కొత్తాడ, జడేరు, బయనపల్లి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతాంగం దళారులను నమ్మి మోసపోకుండా రైతులను అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుందన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







