రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 18 నవంబర్ 2021: మండలంలోని నాలుగు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ శ్రీమన్నారాయణ, మండల వ్యవసాయ అధికారిణి సరళ అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ శాఖ సిబ్బంది, వీఆర్వోలు, టెక్నికల్ అసిస్టెంట్లకు గురువారం అవగాహన కల్పించారు. మండలంలోని మోహనపురం, కొత్తాడ, జడేరు, బయనపల్లి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతాంగం దళారులను నమ్మి మోసపోకుండా రైతులను అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుందన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us