కాకినాడ (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: పలువురు తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇస్తూ.. బదిలీలు చేస్తూ కలెక్టర్ హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ గ్రామీణ ఉప తహసీల్దారు మురార్జీని ఉద్యోగోన్నతిపై అక్కడే తహసీల్దారుగా నియమించారు. సెజ్ ఉప తహసీల్దారు ఎల్.ఝాన్సీలక్ష్మీని రౌతులపూడికి, జిల్లా పౌరసరఫరాల సంస్థ ఉప తహసీల్దారు పి.త్రినాథరావును అయినవిల్లి తహసీల్దారుగా నియమించారు. కె.గంగవరం తహసీల్దారుప్రసాద్ను తాళ్లరేవుకు, నిరీక్షణలో ఉన్న పి.చిన్నారావును కపిలేశ్వరపురానికి, అమరావతి నుంచి వచ్చిన వీవీ సత్యనారాయణను రావులపాలేనికి,తొండంగి ఉప తహసీల్దారు కె.కీర్తికి అక్కడే తహసీల్దారు బాధ్యతలు అప్పగించారు. మామిడికుదురు తహసీల్దారు ఎం.సుజాతను కడియానికి..అక్కడ తహసీల్దారు భీమారావును ఎటపాక ఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







