నాణ్యమైన విత్తన రకాలతోనే అధిక దిగుబడులు:ఏడీఏ రత్నప్రశాంతి

పెద్దాపురం: 16 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారానే పంటల సాగులో అధిక దిగుబడులను సాధించవచ్చని ఏడీఏ ఎం.రత్నప్రశాంతి పేర్కొన్నారు. మండలంలోని చదలాడ, తిరుపతి గ్రామాల్లో రైతులకు అమె చేతుల మీదుగా మంగళవారం వరి విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై ఎంటీయూ 7029, బీపీటీ 5204, విత్తనాలు అందచేయడం జరుగుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఏఏ కొల్లి ఉదయ్ కుమార్, వీఆర్వో వెంకటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us