UPDATED 16th NOVEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక రైల్వే పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో గురువారం తెల్లవారుజామున 20 మోటారు సైకిళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు ఆరు లక్షలు పైబడి ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రమాద ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు.







