పెద్దాపురం: 31 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. రామాయణ మహాకావ్యాన్ని రచించడం ద్వారా సీతారాముల సద్గుణాలను, గొప్పదనాన్ని చెప్పడంతో పాటు ఆదర్శవంతమైన జీవితం గడపడానికి, సమాజ శ్రేయస్సుకు అవసరమైన ఎన్నో జీవన సూత్రాలను మనకు తెలియచేసిన వాల్మీకి మహర్షికి మనందరం రుణపడి ఉన్నామన్నారు. ఆ మహాశయుని జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం మనం అదృష్టంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, కార్యాలయ ఏవో వీరేశ్వరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







