ఓటీఎస్ పథకంతో రుణ విముక్తులు కండి: సబ్ కలెక్టర్ సింహాచలం

గంగవరం (రెడ్ బీ న్యూస్): 30 నవంబర్ 2021: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా గృహాల నిర్మాణం లబ్ధిదారులు రుణ విముక్తులు కావాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ సింహాచలం సూచించారు. మండలంలోని లక్కొండలో గృహనిర్మాణ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పథకం ఆవశ్యకతను వివరించి యాట్ల లక్ష్మి అనే లబ్ధిదారు నుంచి పదివేల రూపాయలను కట్టించుకుని రుణ విముక్తి పత్రాన్ని అందజేశారు. ఏజెన్సీలోని లబ్ధిదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆయన వెంట సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us