UPDATED 29th APRIL 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: పదవ తరగతి ఫలితాల్లో స్థానిక గాంధీనగర్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ కి చెందిన నలుగురు విద్యార్థులు 10 /10 గ్రేడ్ పాయింట్స్ సాధించి తమ సత్తా చాటారు. పి.వి.పి. మౌనిక, కె. లోకేష్, కె. శైలజ, కె. జ్ఞానేశ్వర్ లు10 /10 గ్రేడ్ పాయింట్స్ సాధించి ముందంజలో నిలిచారని, పరీక్షకు హాజరైన నలభై తొమ్మిది మంది విద్యార్థులలో ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు 9.0 ఫై గ్రేడ్ పాయింట్లు సాధించారని, ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా నూరుశాతం ఉత్తీర్ణత సాధించామని ప్రిన్సిపాల్ తెలిపారు.







