గంగవరం (రెడ్ బీ న్యూస్) 14 నవంబర్ 2021: విజ్ఞాన భాండాగారాలు గ్రంధాలయాలయాలని, విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఏర్పాటుచేసిన గ్రంధాలయాలు దేవాలయాల కన్నా గొప్పవాని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఎంఎన్ పట్నాయక్, ఇంపాక్ట్ మోటివేషన్ ట్రైనర్ కె.రాంబాబు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల్లో ఆదివారం పాల్గొని వారోత్సవాలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చు కోవాలన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు, పురాణ, ఇతిహాసాలు, నవల్స్, దినపత్రికలు అందుబాటులో ఉన్నాయని, అవి ఎంతో ఉపయోగకరమన్నారు. అన్నివర్గాలవారికి ఉపయోగపడే అన్నిరకాల పుస్తకాలు గ్రంధాలయంలో లభిస్తాయన్నారు. ఉన్నాయన్నారు. ఈనెల 18వ తేదీన పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులతో కలిసి చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా సీనియర్ రెగ్యులర్ రీడర్ అయిన నరసింహమూర్తి పట్నాయక్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి జే. సత్యవతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







