Betting appమహారాణి ఆశయ సాధనకు
కృషి చేయాలి
పెద్దాపురం ( రెడ్ బీ న్యూస్) 22 నవంబరు 2021: మహారాణి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మహారాణి
సత్రం ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్ కోరారు. స్థానిక రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహుద్దూర్ మహారాణి 186వ వర్ధంతిని ఈవో ఆధ్వ
ర్యంలో సోమవారం నిర్వహించారు. ముందుగా మహారాణీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈవో మాట్లాడుతూ బాటసారులు,
అన్నారులు, నిరుపేదల ఆకలిబాధను తీర్చేందుకు
18వ శతాబ్దంలో సత్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా గర్వకారణమన్నారు. నాటి నుంచీ నేటివరకూ నిరాటంకంగా ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం జరగడం గొప్ప విషయమన్నారు. అనంతరం నిరుపేదలకు వస్త్రదానం చేశారు. ఈకార్యక్రమంలో సత్రం సిబ్బంది బులుసు రవి తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







