UPDATED 20th OCTOBER 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: పట్టణంలో సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత విద్యా కేంద్రం అభివృద్ధికితమ సంస్థ కృషి చేస్తుందని బచ్చు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బచ్చు కోటేశ్వరావు పేర్కొన్నారు. ఎంఈవో వై.వి. శివరామకృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భవిత విద్యా కేంద్రం ప్రహారీ, గేటు నిర్మాణం నిమిత్తం చేపట్టిన అభివృద్ధి పనులను డాక్టర్ కోటేశ్వరావు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బచ్చు ఫౌండేషన్ ప్రతినిధులు డేనియల్ బొచల్, బార్బరా.బి. లియోబ్, అమీ కార్నీ, పాట్రిక్ కార్నీ, తదితరులు పాల్గొన్నారు.







